Crime News: చాక్లెట్ల ఆశ చూపి చిదిమేశారు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒక కేసులో నిందితుడు
నిజామాబాద్లో ఇద్దరు చిన్నారులపై దివ్యాంగుడి అఘాయిత్యం
ఎల్లారెడ్డి డివిజన్లో ఆరేళ్ల పాపపై బాలుడి అత్యాచారం
నిందితుడు వసీం
నిజామాబాద్ నేరవార్తలు, ఎల్లారెడ్డి గ్రామీణం, న్యూస్టుడే: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒక కేసులో నిందితుడు దివ్యాంగుడు కాగా మరో కేసులో ఈ దారుణానికి పాల్పడింది పదిహేనేళ్ల బాలుడు కావడం గమనార్హం. నిజామాబాద్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. ఓ కాలనీలో కూలీ పనులు చేసుకుని బతికే కుటుంబాలకు నివసిస్తున్నాయి. పెద్దలు పిల్లలను ఇంట్లో వదిలి పనులకు వెళ్తుంటారు. ఆదివారం కాలనీలో ఆడుకుంటున్న చిన్నారులపై (8, 12 ఏళ్లు) స్థానికుడైన వసీం (33) కన్నేశాడు. వారికి చాక్లెట్ల ఆశ చూపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు. బుధవారం ఓ బాలికకు నొప్పి రావడంతో కుటుంబీకులకు తెలియజేయగా విషయం బయటపడింది. వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు వసీంను రిమాండుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. పోలియో పీడితుడైన అతడు మేస్త్రీగా పనిచేస్తుంటాడు. అతడికి భార్య, ఓ పాప ఉన్నారు. మరో ఘటనలో ఎల్లారెడ్డి డివిజన్లో ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై అదే కాలనీకి చెందిన పదిహేనేళ్ల బాలుడు గురువారం చాక్లెట్ ఆశ చూపి ఇంటి వెనక్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంట్లో నిద్రపోతున్న తల్లి బాలిక కేకలు విని వచ్చి చూసేసరికి బాలుడు పారిపోతూ కనిపించాడు. బాధితులు ఠాణాలో ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ