TS News: ట్రైనీ ఐఏఎస్పై లైంగిక వేధింపుల కేసు
ట్రైనీ ఐఏఎస్ బానోతు మృగేందర్లాల్ (30)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృగేందర్లాల్ ప్రస్తుతం
మూసాపేట, న్యూస్టుడే: ట్రైనీ ఐఏఎస్ బానోతు మృగేందర్లాల్ (30)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృగేందర్లాల్ ప్రస్తుతం తమిళనాడు మధురైలో శిక్షణ ఐఏఎస్గా పనిచేస్తున్నారు. ఈయన రెండేళ్ల కిందట హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న సమయంలో కూకట్పల్లిలో ఉంటున్న ఓ యువతి (25)తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పరుచుకుని సన్నిహితమయ్యారు. ఒకరోజు ఆ యువతి తల్లిదండ్రులను ఒప్పించి.. బయటకు తీసుకెళ్లిన మృగేందర్ స్నేహితులతో కలసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను వంచించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మృగేందర్ తండ్రి వైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ అని తెలిపారు. మృగేందర్ తండ్రి, తల్లి కూడా తనను బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ను వివరణ కోరగా.. బాధితురాలు తమ బంధువేనని చెప్పారు. కేసు గురించి తనకు వివరాలు తెలియదన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ టి.నర్సింగ్రావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు