Crime News: ఆ రోజు ఏం జరిగింది?
అనుమానాస్పద స్థితిలో హైదరాబాద్లోని ఓ లాడ్జి గదిలో విగతజీవిగా కనిపించిన ఒంగోలు మండలం కరవది ప్రాంతానికి చెందిన ‘నర్సు’ కేసులో ఎన్నెన్నో చిక్కుముళ్లు కనిపిస్తున్నాయి. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే ప్రేమికుడు హత్య చేసి ఉంటాడని
కరవది యువతి మృతిపై అనుమానాలెన్నో
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, శేరిలింగంపల్లి, ఒంగోలు నేరవిభాగం: అనుమానాస్పద స్థితిలో హైదరాబాద్లోని ఓ లాడ్జి గదిలో విగతజీవిగా కనిపించిన ఒంగోలు మండలం కరవది ప్రాంతానికి చెందిన ‘నర్సు’ కేసులో ఎన్నెన్నో చిక్కుముళ్లు కనిపిస్తున్నాయి. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే ప్రేమికుడు హత్య చేసి ఉంటాడని చందానగర్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు లోతుగా విచారిస్తున్నారు.
ఒత్తిడి తేవడంతో: కరవదికి చెందిన నాగచైతన్య(24) హైదరాబాద్ నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్ రిప్రజంటేటివ్. విధుల్లో భాగంగా ఇద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరు నెలల నుంచి పెళ్లి చేసుకోవాలంటూ నాగచైతన్య.. కోటిరెడ్డిపై ఒత్తిడి తెస్తోంది. సామాజిక వర్గాలు వేరు కావడంతో కోటిరెడ్డి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నెల 23న నల్లగండ్లలోని ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్నారు. ఆదివారం రాత్రి వరకు తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి తెరిచారు. నాగచైతన్య రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించగా.. కోటిరెడ్డి జాడ కనిపించకపోవడంతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ క్యాస్ట్రో రంగంలోకి దిగి.. ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో కోటిరెడ్డి చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించారు.
‘కత్తి’తోనే ఎందుకు?
ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లుగా కోటిరెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఎవరో బలంగా కత్తితో పొడవటం వల్లే నాగచైతన్య మరణించినట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ప్రేమికులిద్దరూ కత్తితోనే ఎందుకు పొడుచుకుని చనిపోవాలనుకున్నారు? ఎన్నో ఆసుపత్రులుండగా గాయాలతో కోటిరెడ్డి ఒంగోలు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఒక్కడే వెళ్లాడా? ఎవరైనా సహకరించారా? హోటల్ గదిలో రక్తపు మరకలను చెరిపేసేందుకు ప్రయత్నించిందెవరు? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి కావడంతో కోటిరెడ్డిని మంగళవారం చందానగర్ పోలీసులు ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే