TS News: తల్లి బతికుండగానే పెద్దకర్మ
కన్నతల్లి బతికుండగానే పెద్దకర్మ చేయాలని నిర్ణయించాడో ప్రబుద్ధుడు. బంధువులకూ సమాచారమిచ్చాడు. కుమారుడి నిర్వాకంతో ఆవేదనకు గురైన బాధితురాలు పోలీసులకు...
కార్డులు పంచిన పెద్ద కొడుకు
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
పెద్దకర్మ కార్డు
నకిరేకల్, న్యూస్టుడే: కన్నతల్లి బతికుండగానే పెద్దకర్మ చేయాలని నిర్ణయించాడో ప్రబుద్ధుడు. బంధువులకూ సమాచారమిచ్చాడు. కుమారుడి నిర్వాకంతో ఆవేదనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. నకిరేకల్కు చెందిన వారణాసి పోషమ్మకు ఇద్దరు కుమారులు. నలుగురు కుమార్తెలు. అందరికీ వివాహాలయ్యాయి. చాలాకాలంగా పోషమ్మ చిన్న కుమారుడి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ‘‘ఈ నెల 19న తన తల్లి పోశమ్మ మృతి చెందారని, 28న పెద్దకర్మ నిర్వహించనున్నామని’ పేర్కొంటూ పెద్ద కుమారుడు కార్డులను ముద్రించి బంధువులకు పంపిణీ చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిని పరిశీలిస్తున్నామని నకిరేకల్ సీఐ కె.నాగరాజు గురువారం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?