Crime News: ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని గొంతుకోసిన ఉన్మాది

అర్ధరాత్రి యువతి ఇంట్లోకి ప్రవేశించి ఓ యువకుడు కత్తితో ఆమె గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. ప్రతిఘటించిన యువతి కేకలు వేయడంతో నిద్రలేచిన కుటుంబసభ్యులు...

Updated : 29 Oct 2021 06:52 IST

అర్ధరాత్రి ఘాతుకం

యువతి గొంతుపై గాయం నిందితుడు ప్రేమ్‌సింగ్‌

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: అర్ధరాత్రి యువతి ఇంట్లోకి ప్రవేశించి ఓ యువకుడు కత్తితో ఆమె గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. ప్రతిఘటించిన యువతి కేకలు వేయడంతో నిద్రలేచిన కుటుంబసభ్యులు ఉన్మాదిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ గురువారం వెల్లడించారు. వట్టినాగులపల్లిలో నివాసముంటున్న ఓ యువతి(22) మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చివరి సంవత్సరం చదువుతోంది. బుధవారం రాత్రి భోజనం అనంతరం తన గదిలోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి 1.30 తరువాత జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ప్రేమ్‌సింగ్‌(23) అక్రమంగా యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె గదిలోకి వెళ్లి,  నిద్రిస్తున్న యువతిపై కత్తితోదాడికి తెగబడ్డాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు నిద్రలేచి ఆమె గది తలుపులను బద్దలుకొట్టి యువకుడి చేతిలో ఉన్న కత్తిని లాక్కొని అతడికి దేహశుద్ధి చేసి స్తంభానికి కట్టేశారు. గొంతు, ఎడమ చేయి, మోకాలిపై రక్తగాయాలతో పడి ఉన్న యువతిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కొండాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని