విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి
పంట చేలో మిరపతోటకు నీరు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ మహిళారైతు మరణించారు. ఈ విషాద ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం
ఆరుగురు అధికారులపై కేసు నమోదు
కామేపల్లి, న్యూస్టుడే: పంట చేలో మిరపతోటకు నీరు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ మహిళారైతు మరణించారు. ఈ విషాద ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగులో జరిగింది. గ్రామానికి చెందిన ఆలకుంట్ల రమాదేవి(45) మిరప తోటకు కాలువల ద్వారా నీరు అందిస్తున్నారు. పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభం స్టే వైర్ను పట్టుకోగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు ఆందోళన చేశారు. రూ.5 లక్షలు పరిహారం అందేలా చూస్తామని ఏఈ నారాయణ హామీ ఇచ్చారు. రమాదేవికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి భర్త సత్యం ఫిర్యాదు మేరకు... ఆరుగురు విద్యుత్తుశాఖ అధికారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..