Crime News: ముక్కలుగా నరికి.. వీధికొకటి విసిరి..
మీసేవ కేంద్రంలో పనిచేసే ఆపరేటర్ను అత్యంత కిరాతకంగా హత్యచేసి శరీర భాగాలను తెగనరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గోదావరిఖనిలో మీసేవ ఆపరేటర్ దారుణ హత్య
గోదావరిఖని, న్యూస్టుడే: మీసేవ కేంద్రంలో పనిచేసే ఆపరేటర్ను అత్యంత కిరాతకంగా హత్యచేసి శరీర భాగాలను తెగనరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీపీసీ ఖాజీపల్లిలో ఉండే కాంపల్లి శంకర్ (35) గోదావరిఖనిలోని విఠల్నగర్ మీసేవ కేంద్రంలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గురువారం సాయంత్రం నుంచి శంకర్ కనిపించకుండా పోయాడు. శుక్రవారం అతడి తల్లి పోచమ్మ పోలీసులకు ఫిర్యాదుచేసింది. మొండెం లేని శంకర్ తల భాగాన్ని శనివారం ఉదయం ఎన్టీపీసీ ప్లాంటు గోడ వద్ద గుర్తించారు. ఇతర శరీర భాగాల కోసం పోలీసులు గాలించారు. చివరకు నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడయ్యాయి. అతను ఇచ్చిన సమాచారం మేరకు తల నుంచి శరీరం వరకు ఉన్న భాగం ఒకచోట, మిగతా భాగాలను వేర్వేరుచోట్ల పడేసినట్లు గుర్తించి శనివారం రాత్రి వరకు స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడిని అతని భార్య, ఆమె బంధువులే హత్య చేశారంటూ శంకర్ తల్లి ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు