Crime News: యువకుడి కడుపులో బంగారు ఉండలు..!

ఓ ప్రయాణికుడి కడుపులో ఉండలు లాంటివి ఉన్నట్లు గుర్తించి వైద్యుల సాయంతో బయటకు తీయగా.. వాటిలో పేస్టు రూపంలోని బంగారం దాచినట్లు బయటపడింది. తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయానికి గురువారం ఉదయం షార్జా నుంచి

Updated : 03 Dec 2021 06:47 IST

అరెస్టు చేసిన కోయంబత్తూరు విమానాశ్రయం అధికారులు

అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం ఉండలు

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: ఓ ప్రయాణికుడి కడుపులో ఉండలు లాంటివి ఉన్నట్లు గుర్తించి వైద్యుల సాయంతో బయటకు తీయగా.. వాటిలో పేస్టు రూపంలోని బంగారం దాచినట్లు బయటపడింది. తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయానికి గురువారం ఉదయం షార్జా నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అతడిని స్కాన్‌ చేయగా కడుపులో 3 ఉండలు ఉన్నట్లు తెలిసింది. వాటిల్లో పేస్టు చేసిన బంగారం ఉంచి తరలిస్తున్నట్లు గుర్తించి వైద్యుడి సాయంతో బయటకు తీయించారు. ఈ ఘటనలో సుమారు రూ.32 లక్షల విలువైన 640 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణకు పాల్పడిన ఆ యువకుడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని