Crime News: యువకుడి కడుపులో బంగారు ఉండలు..!
ఓ ప్రయాణికుడి కడుపులో ఉండలు లాంటివి ఉన్నట్లు గుర్తించి వైద్యుల సాయంతో బయటకు తీయగా.. వాటిలో పేస్టు రూపంలోని బంగారం దాచినట్లు బయటపడింది. తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయానికి గురువారం ఉదయం షార్జా నుంచి
అరెస్టు చేసిన కోయంబత్తూరు విమానాశ్రయం అధికారులు
అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం ఉండలు
కోయంబత్తూరు, న్యూస్టుడే: ఓ ప్రయాణికుడి కడుపులో ఉండలు లాంటివి ఉన్నట్లు గుర్తించి వైద్యుల సాయంతో బయటకు తీయగా.. వాటిలో పేస్టు రూపంలోని బంగారం దాచినట్లు బయటపడింది. తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయానికి గురువారం ఉదయం షార్జా నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అతడిని స్కాన్ చేయగా కడుపులో 3 ఉండలు ఉన్నట్లు తెలిసింది. వాటిల్లో పేస్టు చేసిన బంగారం ఉంచి తరలిస్తున్నట్లు గుర్తించి వైద్యుడి సాయంతో బయటకు తీయించారు. ఈ ఘటనలో సుమారు రూ.32 లక్షల విలువైన 640 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణకు పాల్పడిన ఆ యువకుడిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా