Crime News: హితం చెప్పినందుకు స్నేహితుడి హత్య
డబ్బులు దుబారా చేయవద్దని హితం చెప్పిన స్నేహితుడినే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో చోటుచేసుకుంది. రాజానగరం సీఐ ఎం.వి.సుభాష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం..
ఆపై గదిలోనే దహనానికి యత్నం
సాయి వెంకటేష్
రాజానగరం, న్యూస్టుడే: డబ్బులు దుబారా చేయవద్దని హితం చెప్పిన స్నేహితుడినే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో చోటుచేసుకుంది. రాజానగరం సీఐ ఎం.వి.సుభాష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. కంచిబొట్ల నాగ సాయి అలియాస్ సాయి వెంకటేష్(25), సాయి పవన్ స్నేహితులు. పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ అనాథలు కావడంతో కొన్నాళ్లుగా కోలమూరులో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయి పవన్ తన సంపాదనను స్నేహితులతో కలిసి దుబారా చేస్తుండటంతో సాయి వెంకటేష్ తరచూ మందలిస్తుండేవాడు. దీంతో అతడిపై పవన్ పగ పెంచుకున్నాడు. నాలుగైదురోజుల కిందట స్నేహితుల సాయంతో సాయి వెంకటేష్ను హత్యచేసి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. వీలు కాకపోవడంతో శుక్రవారం రాత్రి గదిలోనే మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఆ గది వద్దకు వెళ్లగా.. లోపల ఉన్న పవన్, అతని స్నేహితులు సగం కాలిన మృతదేహాన్ని బాత్రూమ్లో పడేసి పారిపోయారు. పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్