కారు వేగం.. తీసింది ప్రాణం

వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలిలోనే దుర్మరణం చెందగా ఓ మహిళ, బాలుడు ఆసుపత్రిలో చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పూలకుంట-గోనబావి గ్రామాల మధ్య సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లికి చెందిన రాజశేఖర్‌ తన భార్య రూప, కుమారుడు రాము, కుమార్తె

Published : 07 Dec 2021 04:36 IST

ఆటోను ఢీకొట్టగా ఆరుగురి దుర్మరణం

అనంతపురం జిల్లాలో ఘోరం

గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలిలోనే దుర్మరణం చెందగా ఓ మహిళ, బాలుడు ఆసుపత్రిలో చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పూలకుంట-గోనబావి గ్రామాల మధ్య సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లికి చెందిన రాజశేఖర్‌ తన భార్య రూప, కుమారుడు రాము, కుమార్తె రశ్మితతో కలిసి రెండురోజుల క్రితం ఆటోలో కర్ణాటకలోని ఉలిగిలో కొలువైన ఉలిగమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. సోమవారం తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో పూలకుంట దగ్గర తమ గ్రామానికే చెందిన నాగమ్మతోపాటు ఆమె కుమార్తె లక్ష్మి, మనవడు మహేంద్రను ఎక్కించుకున్నారు. అరగంటలో ఊరు చేరుకుంటారనగా... ఓ కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న రాజశేఖర్‌(25), రశ్మిత(5), నాగమ్మ(60), మహేంద్ర(8) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లక్ష్మి (35), రాజశేఖర్‌ కుమారుడు రాము(4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రాజశేఖర్‌ భార్య రూపకు, కారును నడిపిన ప్రతాప్‌రెడ్డికీ గాయాలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని