AP News: ఎంపీడీవోను దూషించిన వైకాపా నేత అరెస్టు
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కేఆర్ విజయను దుర్భాషలాడిన వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి వాసంశెట్టి తాతాజీని అదుపులోకి తీసుకున్నట్లు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి మంగళవారం తెలిపారు.
అయినవిల్లి, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కేఆర్ విజయను దుర్భాషలాడిన వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి వాసంశెట్టి తాతాజీని అదుపులోకి తీసుకున్నట్లు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి మంగళవారం తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో డీఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాతాజీ, అయినవిల్లి జడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, కె.జగన్నాథపురం సర్పంచి భర్త మేడిశెట్టి శ్రీనివాస్, శంకరాయగూడెం మాజీ సర్పంచి కుడిపూడి రామకృష్ణ ‘మా మాట వినకపోతే చీరెస్తా’ అంటూ బెదిరించారని ఎంపీడీవో విజయ సోమవారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం, ఆడవారిని అసభ్య పదజాలంతో దూషించారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంపీడీవోను బెదిరించినందుకు నిరసనగా జిల్లాలో పలుచోట్ల ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది నిరసన చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!