విద్యుదాఘాతంతో ఏనుగు మృతి
విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని వేపనపల్లెలో మంగళవారం వెలుగుచూసింది. పొలాల్లో గజరాజు మృతి చెంది ఉండటాన్ని
విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని వేపనపల్లెలో మంగళవారం వెలుగుచూసింది. పొలాల్లో గజరాజు మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి పొలంలోని వరి కుప్పలను తినేసి.. మరికొన్నింటిని పాడు చేసింది. అనంతరం వ్యవసాయ బోరుకు అమర్చిన విద్యుత్తు వైర్లను నోటితో కొరికి లాగడంతో షాక్కు గురై మృతి చెందింది. దాని వయసు పదేళ్లు ఉంటుందని అటవీ అధికారులు చెప్పారు.
- న్యూస్టుడే, బంగారుపాళ్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి