తాగి విధుల్లోకి ప్రొటోకాల్ డ్రైవర్
ప్రభుత్వ ప్రొటోకాల్ విభాగానికి చెందిన ఓ సీనియర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతూ హోంగార్డును ఢీకొట్టాడు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది
విమానాశ్రయంలో హోంగార్డును ఢీకొట్టడంతో ప్రమాదం
ఉపరాష్ట్రపతి పర్యటన రిహార్సల్స్లో అపశ్రుతి
శంషాబాద్, న్యూస్టుడే: ప్రభుత్వ ప్రొటోకాల్ విభాగానికి చెందిన ఓ సీనియర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతూ హోంగార్డును ఢీకొట్టాడు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 9న హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో మంగళవారం సైబరాబాద్ పోలీసులు, ప్రొటోకాల్శాఖ అధికారులు సంయుక్తంగా హైదరాబాద్ నుంచి విమానాశ్రయం వరకు రిహార్సల్స్ నిర్వహించారు. ప్రొటోకాల్ విభాగంలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ తాజుద్దీన్ కారును అజాగ్రత్తగా నడిపి.. విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్జీఐఏ విభాగం హోంగార్డు అశోక్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన హోంగార్డును అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్కు శ్వాస విశ్లేషణ పరీక్ష చేయగా బీఏసీ 77 రీడింగ్ రావడంతో భద్రతాధికారుల అవాక్కయ్యారు. మద్యం మత్తులో విధులకు హాజరుకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు