నకిలీ వీసాలతో గల్ఫ్ వెళ్లే యత్నం
నకిలీ వీసాలు, ధ్రువీకరణ పత్రాలతో గల్ఫ్కు వెళ్లేందుకు యత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వీరందరూ తెలంగాణ, ఏపీ, గోవా, తమిళనాడు
‘శంషాబాద్’లో 44 మంది మహిళలను అడ్డుకున్న అధికారులు
పోలీసుల అదుపులో ఇద్దరు సబ్ ఏజెంట్లు!
ఈనాడు-హైదరాబాద్, శంషాబాద్-న్యూస్టుడే: నకిలీ వీసాలు, ధ్రువీకరణ పత్రాలతో గల్ఫ్కు వెళ్లేందుకు యత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వీరందరూ తెలంగాణ, ఏపీ, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. వీరికి ఏజెంట్లు జజీరా ఎయిర్లైన్స్ విమానంలో టికెట్లు బుక్ చేశారు. వారు ఇచ్చిన వీసాలు, ధ్రువీకరణ పత్రాలతో మంగళవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారి వద్ద విజిటింగ్ వీసా, కువైట్లో పనిచేసేందుకు ఎంప్లాయిమెంట్ వీసాలున్నాయి. విమానాశ్రయంలో ఒక వీసా, కువైట్లో అధికారులకు మరొకటి చూపాలని దళారులు చెప్పారని మహిళలు తెలిపారు. వారిని పోలీసులకు అప్పగించారు. 44 మంది మహిళల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఉభయగోదావరి, రాయలసీమ, కరీంనగర్ జిల్లాలకు చెందినవారు సైతం ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు సబ్ ఏజెంట్ల ద్వారా ముంబయిలోని ప్రధాన ఏజెంటు ఈ దందా సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్