Crime News: 15 మంది టీచర్లపై గ్యాంగ్రేప్ ఆరోపణలు!
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్తోపాటు 15 మంది టీచర్లపై అదే పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థినులు గ్యాంగ్రేప్ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఆ 15 మందిలో అయిదుగురు మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరి సాయంతో
రాజస్థాన్లో అయిదుగురు విద్యార్థినుల ఫిర్యాదు
జైపుర్: రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్తోపాటు 15 మంది టీచర్లపై అదే పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థినులు గ్యాంగ్రేప్ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఆ 15 మందిలో అయిదుగురు మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరి సాయంతో మిగతా ఉపాధ్యాయులు తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, వీరు వీడియోలు కూడా తీశారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. సంబంధిత గ్రామానికి వెళ్లి విచారణ జరిపిన పోలీసులు దీన్ని ‘ప్రతీకారం.. సాక్షుల వేధింపు’ కేసుగా అనుమానిస్తున్నారు. అదే పాఠశాలకు చెందిన ఓ మాజీ ఉపాధ్యాయుడు ముగ్గురు విద్యార్థినులపై లైంగికదాడి జరిపిన ఆరోపణలతో గత డిసెంబరులో అరెస్టయ్యారు. ఈ కేసులో సస్పెండయిన అతనికి వ్యతిరేకంగా పాఠశాల సిబ్బంది మొత్తం వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవలే బెయిలుపై విడుదలైన ఆ ఉపాధ్యాయుడు మంగళవారం రాత్రి విద్యార్థినులు మంధన్ పోలీస్స్టేషనుకు వచ్చి తాజా ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఠాణా బయటే వేచి ఉండటం గమనార్హం. తాము జరిపిన ప్రాథమిక విచారణను బట్టి, ఈ అయిదుగురు విద్యార్థినుల కుటుంబాలను సస్పెండయిన టీచరు ప్రేరేపించినట్టుగా ఉందని భివాడి ఎస్పీ రామమూర్తి జోషి తెలిపారు. కేసు విచారణలో కింది తరగతులకు చెందిన మరో ముగ్గురు విద్యార్థినులు కూడా ఉపాధ్యాయ బృందంపై ఇదేవిధమైన ఆరోపణలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM