Crime News: బడికి వెళ్తుండగా అడ్డగించి..తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం
తొమ్మిదో తరగతి విద్యార్థిని బడికి వెళ్తుండగా అడ్డగించిన ఇద్దరు యువకులు, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో మంగళవారం ఈ దారుణం
ఇద్దరు యువకులపై కేసు నమోదు
పాన్గల్, న్యూస్టుడే: తొమ్మిదో తరగతి విద్యార్థిని బడికి వెళ్తుండగా అడ్డగించిన ఇద్దరు యువకులు, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. ఎస్ఐ నాగన్న కథనం ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ పాఠశాలకు అడ్డదారిలో నడుచుకుంటూ వెళ్లి వచ్చేది. యథావిధిగా మంగళవారం బడికి వెళ్తుండగా స్థానిక యువకులు నాగరాజు (21), అనిల్ (22) ద్విచక్ర వాహనంలో వెంబడించారు. సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. జరిగిన దారుణాన్ని బాలిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లగా..ఆయన సర్పంచి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని ఇన్ఛార్జి ఎస్పీ మనోహర్ సందర్శించారు. కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను త్వరగా అరెస్టు చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..