TS News: ఖమ్మం జిల్లాలో చైనా భాష ట్యాగ్తో పావురం కలకలం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో బుధవారం కాలుకు చైనా భాష ట్యాగ్ ఉన్న పావురం కనిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. గ్రామ సమీపంలోని కల్లంలో రైతులు వరి ధాన్యం ఆరబోశారు.
దమ్మాయిగూడెం గ్రామానికి వచ్చిన పావురం
తిరుమలాయపాలెం, న్యూస్టుడే: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో బుధవారం కాలుకు చైనా భాష ట్యాగ్ ఉన్న పావురం కనిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. గ్రామ సమీపంలోని కల్లంలో రైతులు వరి ధాన్యం ఆరబోశారు. ఆ సమయంలో కపోతం రాగా.. దాని కాలుకు చైనా భాషలో ముద్రించిన ఓ ట్యాగ్ ఉన్నట్లు రైతులు గుర్తించారు. వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఎస్సై భవానీ దాన్ని పరిశీలించి అటవీ శాఖ డివిజనల్ అధికారి సురేశ్కు అప్పగించారు. పావురానికి చికిత్స అందించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారని ఎస్సై చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ సోమ, మంగళవారం చైనా భాష ట్యాగ్తో ఉన్న కపోతాలు కనిపించడం గమనార్హం.
పావురం కాలికి చైనా భాషలో ఉన్న ట్యాగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్