Crime News: నమ్మించి ప్రేయసి ప్రాణం తీసిన ప్రేమోన్మాది

ప్రేమే లోకమన్నాడు.. నెలల తరబడి ఆ యువతి వెంటతిరిగాడు.. పెళ్లి చేసుకొమ్మని నిలదీసినందుకు.. నమ్మించి, గొంతునులిమి దారుణంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో వెలుగు చూసింది.

Published : 09 Jan 2022 07:11 IST

ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి

తిమ్మాపూర్‌, మానకొండూర్‌, న్యూస్‌టుడే: ప్రేమే లోకమన్నాడు.. నెలల తరబడి ఆ యువతి వెంటతిరిగాడు.. పెళ్లి చేసుకొమ్మని నిలదీసినందుకు.. నమ్మించి, గొంతునులిమి దారుణంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో వెలుగు చూసింది. ఎల్‌ఎండీ పోలీసుల కథనం మేరకు.. మన్నెంపల్లికి చెందిన ఏడెల్లి పోచమ్మ, రవి దంపతులకు సంతానం లేక పసిబిడ్డగా ఉన్నపుడు వరలక్ష్మిని తెచ్చి పెంచుకున్నారు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న వరలక్ష్మి(19) కొన్నాళ్లుగా ఇంటి వద్దనే ఉంటోంది. తరచుగా మేకలు మేపడానికి వెళ్లేది. ఈ నెల 2న కూడా అలాగే వెళ్లిన ఆమె.. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో తల్లిదండ్రులు పలుచోట్ల గాలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో ఈ నెల 5న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా వరలక్ష్మికి పరిచయస్థుడైన తిమ్మాపూర్‌ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన అఖిల్‌(19)ను పోలీసులు విచారించారు. తానే యువతిని హత్య చేసినట్టు అతను అంగీకరించాడు. అతనిచ్చిన  సమాచారం మేరకు శనివారం   చెంజర్ల సమీపంలోని గుట్టల్లో మృతదేహాన్ని గుర్తించారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి బలవంతం చేయడంతో చున్నీని గొంతుకు బిగించి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నెల 2న యువతిని హత్య చేసిన అఖిల్‌ అనుమానం రాకుండా గ్రామంలో తిరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. హత్యాచారం కోణంలోనూ పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని