Crime News: కరెంటు షాకిచ్చాడు.. ప్రాణం పోలేదని గొడ్డలితో నరికాడు

కలకాలం కలసి ఉంటానని మాటిచ్చిన భర్తే కరెంటు షాకిచ్చి, ఆపై గొడ్డలితో నరికి అర్ధాంగిని కర్కశంగా కడతేర్చాడు. ఈ పైశాచిక ఘటన మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా గోండ్‌పిప్రీ తాలూకా బంగారాం తడోదిలో జరిగింది. గడ్చిరోలి ఠాణా ఇన్‌స్పెక్టర్‌ జీవన్‌

Updated : 10 Jan 2022 06:47 IST

 ఆపై తానూ ఆత్మహత్యాయత్నం

మహారాష్ట్రలో ఓ భర్త ఘాతుకం

బల్లార్ష, న్యూస్‌టుడే: కలకాలం కలసి ఉంటానని మాటిచ్చిన భర్తే కరెంటు షాకిచ్చి, ఆపై గొడ్డలితో నరికి అర్ధాంగిని కర్కశంగా కడతేర్చాడు. ఈ పైశాచిక ఘటన మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా గోండ్‌పిప్రీ తాలూకా బంగారాం తడోదిలో జరిగింది. గడ్చిరోలి ఠాణా ఇన్‌స్పెక్టర్‌ జీవన్‌ రాజగురు తెలిపిన వివరాల మేరకు.. బంగారాం తడోది గ్రామానికి చెందిన రాజు భావనే(43), యోగిత(35) దంపతులు. వీరికొక కుమారుడు ఓంకార్‌(14). శనివారం భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చినికి చినికి గాలివానైంది. ఈ నేపథ్యంలో భార్యను అంతమొందించాలని పన్నాగం పన్నిన రాజు.. ఆదివారం వేకువజామున ఆమెను హాలులో నిర్బంధించి విద్యుత్‌ తీగల సాయంతో షాకిచ్చాడు. అయినా ప్రాణం పోకపోలేదని గొడ్డలితో మెడపైనా, తలపైనా నరికి హతమార్చాడు. వెంటనే పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్యకు యత్నించాడు. తల్లి రోదనలను పక్కగదిలో నిద్రిస్తున్న కుమారుడు విని అరవడంతో ఇరుగుపొరుగు పరుగున వచ్చారు. దంపతులు ఇద్దరినీ గోండ్‌పిప్రీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యోగిత మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజుకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై కేసు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని