డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఏడుగురి దుర్మరణం

కర్ణాటకలోని దావణగెరె జిల్లా జగళూరు సమీప కాననకట్టె ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు యువకులు మరణించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంలో పనిచేసే

Published : 15 Jan 2022 04:26 IST

కర్ణాటకలో ఘటన

దావణగెరె, న్యూస్‌టుడే: కర్ణాటకలోని దావణగెరె జిల్లా జగళూరు సమీప కాననకట్టె ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు యువకులు మరణించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంలో పనిచేసే వీరంతా కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మల్లనగౌడ (20), సంతోష్‌ (21), జైభీమ్‌ (18), రఘు (23), సిద్ధేశ్‌ (20), వేదమూర్తి (19), ఆనంద్‌ (18)గా గుర్తించారు. మృతదేహాలను జగళూరు ఆసుపత్రిలోని శవాగారానికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని