పోలీసులకు సమాచారమిచ్చాడని చంపారు
సారా తయారీదారుల దారుణానికి ఒక వ్యక్తి బలయ్యాడు. పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే కారణంతో అతన్ని అమానుషంగా చంపారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడులో
సారా తయారీదారుల దారుణం
జీలుగుమిల్లి, న్యూస్టుడే: సారా తయారీదారుల దారుణానికి ఒక వ్యక్తి బలయ్యాడు. పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే కారణంతో అతన్ని అమానుషంగా చంపారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడులో గురువారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పి.వెంకట రామకుమార్(43) పంచాయతీ ట్యాంకు ఆపరేటర్గా పని చేస్తున్నారు. భార్య నుంచి 12 ఏళ్ల కిందట విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. గురువారం పోలీసులు సారా తయారీ కేంద్రంపై దాడిచేశారు. ఆ సమాచారం రామకుమార్ ఇచ్చాడని భావించిన అదే గ్రామానికి చెందిన సారా తయారీదారులైన తండ్రీకొడుకులు పరసా వీర్రాజు, మహేష్ కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతన్ని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామకుమార్ రాత్రి మృతి చెందాడు. మహేష్ను అదుపులోకి తీసుకోగా, వీర్రాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు