కోతుల భయం.. తీసింది ప్రాణం!
కోతులు బెదిరించడంతో భవనం పైనుంచి పడి ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ధర్మపురి ఎస్సై కిరణ్కుమార్, బంధువుల కథనం ప్రకారం..
భవనంపై నుంచి పడి మహిళ మృతి
ధర్మపురి, న్యూస్టుడే: కోతులు బెదిరించడంతో భవనం పైనుంచి పడి ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ధర్మపురి ఎస్సై కిరణ్కుమార్, బంధువుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన నారంభట్ల రాజేశ్వరి(52) హైదరాబాద్లోని ప్రైవేటు పాఠశాలలో చాలా ఏళ్లుగా తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకుందామని గురువారం సాయంత్రమే ఆమె ధర్మపురికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నిర్మాణంలో ఉన్న తన సోదరుడి నూతన గృహాన్ని చూసేందుకు భవనం రెండో అంతస్తు మీదికి వెళ్లారు. అప్పటికే పైన ఉన్న కోతులు రాజేశ్వరిపైకి ఒక్కసారి దూసుకురావడంతో దాడి చేస్తాయనే భయంతో తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త కొన్నేళ్ల కిందటే మృతి చెందారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. పండగ పూట ధర్మపురిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్