విద్యుత్తు తీగలకు చిక్కుకున్నపతంగిని తీస్తుండగా...
పండగ పూట ఆనందంగా ఎగరేసిన గాలిపటమే ఆ బాలుడి పాలిట మృత్యుపాశమైంది. ములుగు జిల్లా కేంద్రంలో శనివారం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పాముల ఏసుబాబు, శాంతకుమారి దంపతులు
ములుగు, న్యూస్టుడే: పండగ పూట ఆనందంగా ఎగరేసిన గాలిపటమే ఆ బాలుడి పాలిట మృత్యుపాశమైంది. ములుగు జిల్లా కేంద్రంలో శనివారం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పాముల ఏసుబాబు, శాంతకుమారి దంపతులు ఇటుక బట్టీలో పని చేసేందుకు మూడేళ్ల క్రితం ములుగుకు వలస వచ్చారు. పండుగకు కొత్త బట్టలు కొనేందుకు శనివారం దంపతులిద్దరూ దుకాణానికి వెళ్లారు. గుడిసె వద్దే ఉన్న వారి కుమారుడు వెంకన్న (12) స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురేశాడు. అది విద్యుత్తు స్తంభం తీగలకు చిక్కుకుంది. వెంకన్న స్తంభం ఎక్కి దాన్ని తప్పించే ప్రయత్నంలో తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాలుడు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి సరఫరా నిలిపివేయించారు. తరవాత బాలుడిని తాడు సాయంతో కిందకు దింపి ములుగు ప్రాంతీయ ఆసుపత్రికి, అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్