ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురి దుర్మరణం
రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులతోపాటు ఓ భవన నిర్మాణ కార్మికుడు మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.
మదనపల్లె (నేరవార్తలు), వాల్మీకిపురం, న్యూస్టుడే: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులతోపాటు ఓ భవన నిర్మాణ కార్మికుడు మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన ఇస్మాయిల్ (23) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆయన బంధువైన సిద్ధిక్(18) కలికిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. వీరు సొంత పనిపై ఈనెల 14న రాత్రి ద్విచక్రవాహనంపై మదనపల్లెకు వచ్చారు. రాత్రి ఆలస్యంగా తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మదనపల్లె రూరల్ 5వ మైలు సమీపంలో వెళ్తుండగా అదే సమయంలో మదనపల్లె రూరల్ కొత్తవారిపల్లెకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శ్రీనివాసులు(49) పెట్రోల్బంకు వద్దకు వస్తుండగా 2వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆపై తిరుపతికి పంపగా.. చికిత్స పొందుతూ ముగ్గురూ మృత్యువాత పడ్డారు. సంక్రాంతినాడే ప్రమాదం జరగడంతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి