పెట్రోలు పోసి కాల్చి... రోకలిబండతో కొట్టి!
మద్యానికి, గంజాయికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్త ఆగడాలను భరించలేకపోయింది. పోలీసుస్టేషన్కు వెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించినా మారకపోవడంతో విసుగు
భర్తను హత్య చేసిన భార్య
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే: మద్యానికి, గంజాయికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్త ఆగడాలను భరించలేకపోయింది. పోలీసుస్టేషన్కు వెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించినా మారకపోవడంతో విసుగు చెందింది. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరిధిలోని శ్రీరామ్నగర్లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.... గిద్దలూరు మండలం కొంగలవీడుకు చెందిన మేకల చిరంజీవి(32) తన మేనత్త కుమార్తె అంకాలమ్మను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి శారదారాణి (3), అఖిల్ (ఏడాదిన్నర), రంగస్వామి (3 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. చిరంజీవి తన కుటుంబంతో కలిసి శ్రీరామ్నగర్లో నివాసముంటున్నారు. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిరంజీవి మద్యానికి, గంజాయికి బానిసై తరచూ భార్యతో ఘర్షణ పడేవాడు. ఆదివారం ఉదయం అంకాలమ్మ తల్లిదండ్రులు కొంగళవీడు ఎస్టీ కాలనీలో పోలేరమ్మ అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవడంతో అక్కడికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. అనంతరం చిరంజీవి తన భార్యతో ఘర్షణ పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో మంచంపై నిద్రిస్తున్న చిరంజీవిపై అంకాలమ్మ పెట్రోలు పోసి నిప్పంటించింది. కాలిన గాయాలతో బయటకు పరుగెడుతుండగా రోకలిబండతో కొట్టడంతో అతను మృతిచెందాడు. అనంతరం ఆమె పోలీసుస్టేషన్కు వెళ్లి, జరిగిన ఘటనను వివరించి లొంగిపోయింది. గిద్దలూరు సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తండ్రి మృతిచెందడం, తల్లి జైలుకు వెళ్లడంతో అభంశుభం తెలియని చిన్నారులు బంధువుల చెంతకు చేరాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్