నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల బుధవారం నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. నేలకొండపల్లి మండలం అనాసాగరానికి చెందిన బొడ్డు సతీష్‌, రోజా దంపతుల కుమారుడు చందు(01) ఇంటి ఎదుట ఉన్న నీటి సంపు వద్ద ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తూ

Updated : 20 Jan 2022 05:27 IST

ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల

నేలకొండపల్లి, సత్తుపల్లి, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల బుధవారం నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. నేలకొండపల్లి మండలం అనాసాగరానికి చెందిన బొడ్డు సతీష్‌, రోజా దంపతుల కుమారుడు చందు(01) ఇంటి ఎదుట ఉన్న నీటి సంపు వద్ద ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తూ సంపులో పడి నీట మునిగి అపస్మారక స్థితికి చేరాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే నేలకొండపల్లి సీహెచ్‌సీకి తరలించారు.అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అలాగే సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన కొత్తపల్లి కమలాకర్‌, నిరోష దంపతులకు కుమార్తె అక్షయ, కుమారుడు నిఖిల్‌(02) ఉన్నారు. గ్యాస్‌ గోదాంలో దినసరి కూలీగా పని చేస్తున్న కమలాకర్‌ విధులకు వెళ్లగా నిరోష పిల్లలను తన అత్తమ్మ మరియమ్మ వద్ద ఉంచి కూలి పనికి వెళ్లింది. మరియమ్మ సంపు వద్ద వంట పాత్రలు కడిగి ఇంట్లో పెట్టేందుకు వెళ్లగా అక్కడే ఆడుకుంటున్న నిఖిల్‌ అందులో పడిపోయి మృతి చెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని