కౌలు రైతు ఆత్మహత్య

సరైన దిగుబడి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపలికి చెందిన కౌలు రైతు మల్లేష్‌ (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం..

Published : 22 Jan 2022 05:04 IST

నెన్నెల, న్యూస్‌టుడే: సరైన దిగుబడి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపలికి చెందిన కౌలు రైతు మల్లేష్‌ (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. తండ్రి వద్దే ఉంటున్న మల్లేష్‌ ఈ ఏడాది కౌలుకు తీసుకొని 10 ఎకరాల్లో పత్తి, 10 ఎకరాల్లో వరి సాగు చేశారు. సరైన పంట దిగుబడి రాలేదని ఆయన తండ్రి రామయ్య తెలిపారు. మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగు మందు తాగాడన్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని