
Published : 22 Jan 2022 05:04 IST
కౌలు రైతు ఆత్మహత్య
నెన్నెల, న్యూస్టుడే: సరైన దిగుబడి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపలికి చెందిన కౌలు రైతు మల్లేష్ (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. తండ్రి వద్దే ఉంటున్న మల్లేష్ ఈ ఏడాది కౌలుకు తీసుకొని 10 ఎకరాల్లో పత్తి, 10 ఎకరాల్లో వరి సాగు చేశారు. సరైన పంట దిగుబడి రాలేదని ఆయన తండ్రి రామయ్య తెలిపారు. మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగు మందు తాగాడన్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు చెప్పారు.
► Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.
Advertisement
Tags :