కుమార్తెపై అఘాయిత్యం.. నిందితుణ్ని కాల్చిచంపిన మాజీ జవాన్‌

అత్యాచార కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం కోర్టుకు హాజరైన బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన దిల్షాద్‌ హుస్సేన్‌ను బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాను భగవత్‌ నిషాద్‌ కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో జరిగింది.

Published : 23 Jan 2022 05:14 IST

అత్యాచార కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం కోర్టుకు హాజరైన బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన దిల్షాద్‌ హుస్సేన్‌ను బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాను భగవత్‌ నిషాద్‌ కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో జరిగింది. 2020 ఫిబ్రవరిలో భగవత్‌ కుమార్తెను దిల్షాద్‌ కిడ్నాప్‌ చేయగా.. పోలీసులు ఆమెను కాపాడారు. అప్పుడే నిందితునిపై అత్యాచారం కేసు కూడా నమోదైంది. తన కుమార్తెపై అఘాయిత్యం చేశాడన్న కోపంతోనే దిల్షాద్‌ను భగవత్‌ కాల్చిచంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. భగవత్‌ను అరెస్టు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.

ముంబయిలో బాలికపై ఆరుగురి అత్యాచారం

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణ ఘటన జరిగింది. గోవండిలోని శివాజీనగర్‌లో ఓ బాలికపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ఆసుపత్రికి తరలించి, నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేశామని.. మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని