Crime News: కట్టుకున్న వస్త్రమే మృత్యుపాశమై..చోరీ యత్నంలో వ్యక్తి మృతి
చోరీ కోసం వచ్చిన ఓ దొంగకు అతడు ధరించిన వస్త్రమే మృత్యుపాశమైంది. గేటు దూకే క్రమంలో లుంగీ ఉరిలా బిగుసుకుపోవడంతో వేలాడుతూ ప్రాణాలొదిలాడు ఆ వ్యక్తి. ఈ ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి
కేశవగిరి(హైదరాబాద్), న్యూస్టుడే: చోరీ కోసం వచ్చిన ఓ దొంగకు అతడు ధరించిన వస్త్రమే మృత్యుపాశమైంది. గేటు దూకే క్రమంలో లుంగీ ఉరిలా బిగుసుకుపోవడంతో వేలాడుతూ ప్రాణాలొదిలాడు ఆ వ్యక్తి. ఈ ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పీఎస్సై హసీనా కథనం ప్రకారం.. బార్కస్లోని జమాల్బండ ప్రాంతానికి చెందిన హుస్సేన్ బిన్ అలీ జైదీ (52) మద్యానికి బానిసై, దొంగతనాలకు అలవాటుపడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున సలాలా పీలిదర్గా రోడ్డులో ఉన్న పాత మోటారు విడిభాగాల గోదాంలో చోరీకి వెళ్లాడు. ప్రహరీకి ఉన్న పెద్ద గేటు ఎక్కి, దూకుతుండగా.. అతను కట్టుకున్న లుంగీ గేటుకు చిక్కుకుంది. నడుం వద్ద లుంగీ ముడివేసి ఉండటంతో ఊడిరాలేదు. పొట్ట, ఛాతీ భాగం దగ్గర అది చుట్టుకుపోయి, ఊపిరాడక అక్కడే ప్రాణాలు విడిచాడు. గోదాం నిర్వాహకులు మధ్యాహ్నం అక్కడికి వెళ్లినప్పుడు గేటుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వారిచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా