పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య
పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బుధవారం రాత్రి మావోయిస్టులు హత్య చేశారు. కుంట పోలీస్ స్టేషన్ పరిధి బటేరు గ్రామానికి చెందిన మడివి దేవా(28) బుధవారం కుంట
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
దుమ్ముగూడెం, న్యూస్టుడే: పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బుధవారం రాత్రి మావోయిస్టులు హత్య చేశారు. కుంట పోలీస్ స్టేషన్ పరిధి బటేరు గ్రామానికి చెందిన మడివి దేవా(28) బుధవారం కుంట వెళ్తుండగా మావోయిస్టులు అపహరించి అడవుల్లోకి తీసుకెళ్లారు. ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఇన్ఫార్మర్గా మారి తమ కదలికలపై పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడని ఆరోపిస్తూ దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కన్నాయ్గూడ ప్రధాన రహదారిపై పడేశారు. కొన్నేళ్ల క్రితం దేవా తండ్రిని కూడా ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!