ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా చింతల్నార్‌-తిమ్మాపురం అటవీ ప్రాంతాల మధ్య  ఆదివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కోబ్రా 201 బెటాలియన్‌, డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా..

Published : 31 Jan 2022 05:09 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా చింతల్నార్‌-తిమ్మాపురం అటవీ ప్రాంతాల మధ్య  ఆదివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కోబ్రా 201 బెటాలియన్‌, డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. తారసపడిన కొంతమంది మావోయిస్టులు  కాల్పులకు దిగడంతో బలగాలూ ప్రతిస్పందించాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందగా, మిగిలినవారు తప్పించుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని