Telangana News: పెళ్లింట విషాదం.. బావమరిదిని చంపిన బావ

తెల్లారితే వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. బావమరిదిపై బావ గొడ్డలితో దాడి చేసి, ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల మండలం అంబారిపేటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలాస గ్రామానికి చెందిన పౌలస్తేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌ వీర్ల శంకర్‌(48).. ఆయన చెల్లెలు జమునను అంబారిపేట వాసి ఆది వెంకటేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ప్రవళిక, పూజిత. కొన్నాళ్లకు...

Published : 03 Feb 2022 06:57 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: తెల్లారితే వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. బావమరిదిపై బావ గొడ్డలితో దాడి చేసి, ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల మండలం అంబారిపేటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలాస గ్రామానికి చెందిన పౌలస్తేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌ వీర్ల శంకర్‌(48).. ఆయన చెల్లెలు జమునను అంబారిపేట వాసి ఆది వెంకటేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ప్రవళిక, పూజిత. కొన్నాళ్లకు వెంకటేష్‌ మరో వివాహం చేసుకుని గ్రామంలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. వెంకటేష్‌ వ్యవసాయ భూమి మొదటి భార్య పేరిట ఉంది. అందులో కొంత భూమిని ఇటీవల వీర్ల శంకర్‌ విక్రయించాడు. ఆ సొమ్ముతో వెంకటేష్‌ పెద్ద కుమార్తె పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తన భూమిని విక్రయించాడన్న కోపంతో బావమరిది శంకర్‌పై వెంకటేష్‌ కక్ష పెంచుకున్నాడు. గురువారం పెద్ద కుమార్తె ప్రవళిక వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పందిరికి అవసరమైన దుంపిడిగుంజను కొట్టితెస్తుండగా వెంకటేష్‌ వచ్చి శంకర్‌తో గొడవకు దిగాడు. కోపం పట్టలేక గొడ్డలితో దాడి జరపగా తీవ్రంగా గాయపడిన శంకర్‌ ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. సంఘటనలో అడ్డువెళ్లిన శంకర్‌ తల్లి గంగుకు గాయాలయ్యాయి. పట్టణ సీఐ కిషోర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని