- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం
కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురి దుర్మరణం
మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు
ములుగు, న్యూస్టుడే: ఉదయాన్నే ఆ రోడ్డు రక్తమోడింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు సహా నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. ములుగు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందగా ఒకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ములుగు మండలం జాకారం పంచాయతీ శివారు గట్టమ్మ గుడి మూలమలుపు వద్ద 163 జాతీయ రహదారిపై శనివారం ఉదయం సుమారు 8.20 గంటల సమయంలో కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన కమ్మంపాటి రమేష్ (49), ఆయన భార్య జ్యోతి (46), ఆయన సోదరుడు కమ్మంపాటి శ్రీనివాస్ (45), చంద్రుపట్ల గ్రామానికి చెందిన కారు డ్రైవర్ బుద్దె కల్యాణ్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాస్ భార్య సుజాత (42) తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. రమేష్ తన అన్న కుమారుడికి పెళ్లి సంబంధం చూసేందుకు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి కారులో వాజేడు నుంచి బయలుదేరారు. గట్టమ్మ వద్దకు రాగానే మేడారం వెళ్తున్న హనుమకొండ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీయించారు. గాయపడిన సుజాతను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు పొక్లెయిన్ సహాయంతో బస్సును, కారును పక్కకు తీయించి రాకపోకలను పునరుద్ధరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Uttam kumar reddy: ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో ప్రధాని చెప్పాలి: ఉత్తమ్కుమార్రెడ్డి
-
India News
Corona: దిల్లీలో ఆస్పత్రుల్లో చేరికలు 60% పెరిగాయ్..!
-
India News
వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం
-
Politics News
Revanth Reddy: సీఎల్పీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు?.. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం
-
India News
Vaccines: ప్రపంచంలో వినియోగించే అన్ని టీకాల్లో.. 60శాతం భారత్వే..!
-
Movies News
Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- TSRTC: హైదరాబాద్లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..