Telangana News: ఉద్యోగం రాలేదని ఇద్దరు యువకుల బలవన్మరణం
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఖమ్మం, వేములవాడల్లో ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోదాడకు చెందిన అల్లిక వేణు(22) 2020లో ఖమ్మంలో
ఖమ్మం నేరవిభాగం, వేములవాడ, న్యూస్టుడే: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఖమ్మం, వేములవాడల్లో ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోదాడకు చెందిన అల్లిక వేణు(22) 2020లో ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేశాడు. తన మిత్రుడికి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చి.. తనకు రాలేదని బాధపడుతున్నాడు. 4రోజుల కిందట ఖమ్మం వచ్చి ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్నాడు. బుధవారం గదిలో ఫ్యానుకు తాడుతో ఉరివేసుకున్నాడు. దీనిపై యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వ్యవసాయ క్షేత్రంలో...
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కాశాయపల్లిలో గోస్కుల ప్రశాంత్(23) ఉరివేసుకుని మృతి చెందాడు. ఇతడి తల్లిదండ్రులు గోస్కుల బాబు, రేణుక. వ్యవసాయ కుటుంబం. ప్రశాంత్ 2020లో డిగ్రీ పూర్తి చేసి ఆర్మీ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందాడు. ఉద్యోగం రావడంలేదంటూ కొద్ది రోజులుగా మనస్తాపం చెందుతున్నాడు. బుధవారం తమ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేష్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ