Hyderabad News: చార్మినార్‌పై ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ.. కేసు నమోదు

భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. చార్మినార్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీని ఆవిష్కరించిన తెరాస నేతలపై కేసు నమోదైంది. ఆదివారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస మొఘల్‌పుర డివిజన్‌ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణ.. మరో

Updated : 13 Mar 2022 06:47 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. చార్మినార్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీని ఆవిష్కరించిన తెరాస నేతలపై కేసు నమోదైంది. ఆదివారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస మొఘల్‌పుర డివిజన్‌ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణ.. మరో నాయకుడు మణికొండ విజయ్‌కుమార్‌తో కలిసి చార్మినార్‌పై శనివారం ఆమె చిత్రపటంతో కూడిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ ఫ్లెక్సీని తొలగించారు. చారిత్రక కట్టడంపై చిత్రపటాల్ని ఆవిష్కరించడం నిబంధనలకు విరుద్ధమని చార్మినార్‌ కన్జర్వేటర్‌ రాజేశ్వరి తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆ నేతలిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చార్మినార్‌ ఇన్‌స్పెక్టర్‌ గురునాయుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని