Crime News: బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం
ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగింది. నిందితులైన ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బండారు సురేష్బాబు
పెదకాకాని, న్యూస్టుడే: ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగింది. నిందితులైన ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బండారు సురేష్బాబు ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. రెండో శనివారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉంది. పక్కింట్లో ఉండే బీటెక్ విద్యార్థి బ్రహ్మం, వెల్డింగ్ పని చేసే బాజి వరప్రసాద్, నరసింహారావు అనే యువకులు ఆమెపై లైంగిక దాడి చేయాలని పథకం వేశారు. తొలుత బ్రహ్మం ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న మరో ఇద్దరూ కలిసి ఆమె నోట్లో వస్త్రం కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపి, కేసు నమోదు చేశారు. ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాస్ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్