Telangana News: ఎస్సై చేతిలో లాఠీ లాక్కొని ఆయన్నే కొట్టారు..!
నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడి చేయడానికి వెళ్లిన ఆబ్కారీ ఎస్సై, కానిస్టేబుల్పై మందు బాబులు దాడి చేసిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీమ్గల్
భీమ్గల్, న్యూస్టుడే: నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడి చేయడానికి వెళ్లిన ఆబ్కారీ ఎస్సై, కానిస్టేబుల్పై మందు బాబులు దాడి చేసిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పురాణీపేట్ శివారులో నాటు సారా విక్రయ కేంద్రాలపై దాడి చేయడానికి ఆబ్కారీ ఎస్సై నర్సింలు, కానిస్టేబుల్ వాహనంలో వెళ్లారు. పురాణీపేట్ శివారుకు చేరుకోగానే మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు వీరిని చూసి పారిపోవడానికి యత్నించారు. అందులో ఒకరు పట్టుబడ్డారు. ఆయనను విచారించి వెళ్తుండగా ముగ్గురు మందుబాబులు వచ్చి ఎస్సై, కానిస్టేబుల్ మీద విరుచుకుపడ్డారు. ఎస్సై చేతిలో ఉన్న లాఠీని లాక్కొని తీవ్రంగా కొట్టారు. ఆబ్కారీ ఎస్సై నర్సింలు ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు భీమ్గల్ ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. కేసు నమోదైనా పోలీసులు వారిని రిమాండ్కు తరలించలేదు. రాజకీయ ఒత్తిడి కారణంగానే రిమాండ్ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి