Crime News: దారుణం.. బతికున్న భార్యను పూడ్చిపెట్టిన భర్త

బతికున్న భార్యను పూడ్చిపెట్టాడో భర్త. ఈ దారుణ ఉదంతానికి సంబంధించి నిందితుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు వేలూరు సమీపంలోని కాట్పాడి వడుకన్‌ తాంగల్‌కు చెందిన వినాయకం...

Updated : 30 Mar 2022 09:54 IST

వేలూరు, న్యూస్‌టుడే: బతికున్న భార్యను పూడ్చిపెట్టాడో భర్త. ఈ దారుణ ఉదంతానికి సంబంధించి నిందితుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు వేలూరు సమీపంలోని కాట్పాడి వడుకన్‌ తాంగల్‌కు చెందిన వినాయకం... ప్రైవేటు ఉద్యోగి. గుడియాత్తం నివాసి సుప్రజను (25) ప్రేమించి నాలుగేళ్ల కిందట పెళ్లాడాడు. దంపతులు కేవీ కుప్పం సమీపంలోని మడినాంపట్టులో నివాసముంటున్నారు. వారికి ఏడాదిన్నర పాప ఉంది. రెండు నెలల క్రితం సుప్రజ అనారోగ్యానికి గురైంది. అప్పుడు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. భార్యను వినాయకం తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. వినాయకం వెంటనే తన తమ్ముడు విజయ్‌, స్నేహితుడు శివకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిచాడు. సుప్రజను అర్ధరాత్రి కవసంబట్టు చక్కెరతోపు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సజీవంగా పాతిపెట్టారు. సుప్రజ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కేవీ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సెంథిల్‌ కుమారి కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. సుప్రజ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని