సొరంగం పైకప్పు కూలి ట్రాక్టర్‌ డ్రైవరు మృతి

పాలమూరు-రంగారెడ్డి పనుల వద్ద సొరంగం పైకప్పు కూలి ఓ ట్రాక్టర్‌  డ్రైవరు మృతి చెందాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రం సమీపంలోని ఉయ్యాలవాడ వద్ద బుధవారం ఈ సంఘటన

Published : 31 Mar 2022 05:43 IST

కందనూలు, న్యూస్‌టుడే: పాలమూరు-రంగారెడ్డి పనుల వద్ద సొరంగం పైకప్పు కూలి ఓ ట్రాక్టర్‌  డ్రైవరు మృతి చెందాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రం సమీపంలోని ఉయ్యాలవాడ వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యాలవాడకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి(38) ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న కంపెనీలో ట్రాక్టర్‌ డ్రైవరుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం పనుల్లో భాగంగా శ్రీనివాస్‌రెడ్డి ట్రాక్టరును నడుపుకొంటూ నలుగురు కార్మికులతో కలిసి సొరంగంలోకి వెళ్లారు. మధ్యలో నీరు నిలవడంతో కార్మికులు పైపుల ద్వారా బయటికి పంపే ప్రయత్నం చేస్తుండగా పైకప్పు కూలింది. శ్రీనివాస్‌రెడ్డి తలపై రాళ్లు పడ్డాయి. తీవ్రగాయాలైన ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని