Missing: తూ.గో. జిల్లా పిఠాపురంలో నలుగురు బాలికల అదృశ్యం
పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు చెప్పకుండా ఇళ్ల నుంచి వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తూర్పు గోదావరి
పిఠాపురం, న్యూస్టుడే: పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు చెప్పకుండా ఇళ్ల నుంచి వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక గత నెల 30న పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. శనివారం తెల్లవారు జామున మరో ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు. కొన్ని రోజుల కిందట వీరి ప్రవర్తన బాగాలేదని తల్లిదండ్రుల సమక్షంలో ఉపాధ్యాయులు మందలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థినులు హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. శుక్రవారం ఓ బాలిక తండ్రి పట్టణ పోలీసులను ఆశ్రయించగా శనివారం మరో తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్సై శంకరరావును వివరణ కోరగా ఇద్దరు బాలికలు కనిపించడం లేదని తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?