అకస్మాత్తుగా దూసుకొచ్చిన లారీ.. కాల్వలో దూకి ప్రాణాలు దక్కించుకున్న తండ్రీ తనయుడు
అకస్మాత్తుగా మీదికి దూసుకొస్తున్న లారీని తప్పించుకునేందుకు పక్కనున్న కాల్వలోకి దూకి తండ్రీకుమారుడు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట సమీపంలోని బీబీగూడెం శివారులో ఆదివారం జరిగింది. స్థానికులు
చివ్వెంల, న్యూస్టుడే: అకస్మాత్తుగా మీదికి దూసుకొస్తున్న లారీని తప్పించుకునేందుకు పక్కనున్న కాల్వలోకి దూకి తండ్రీకుమారుడు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట సమీపంలోని బీబీగూడెం శివారులో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం బండమీది చందుపట్లకు చెందిన రాచకొండ రామకృష్ణ, తన కుమారుడు నవీన్తో కలిసి ద్విచక్రవాహనంపై సూర్యాపేటకు వెళ్తున్నారు. బీబీగూడెం శివారులో మూసీ కాల్వ వద్ద.. ముందు పోతున్న లారీ బైపాస్ రోడ్డు వైపునకు తిరుగుతుండగా తమ వాహన వేగాన్ని నియంత్రించుకున్నారు. ఆ వెనకే వస్తున్న కంటైనర్(లారీ) వేగంగా వీరి మీదకు దూసుకురావడంతో ఎటూ వెళ్లలేక వారిద్దరు పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి దూకారు. వీరు కాల్వలోకి దూకడం, ఆ వెంటనే ద్విచక్రవాహనంపై లారీ ఎక్కడం క్షణాల్లో జరిగిపోయింది. కాల్వలో నీళ్లు ఉండటంతో ఈదుకుంటూ తండ్రీకుమారుడు ఒడ్డుకు చేరుకున్నారు. కాల్వ వంతెనపై ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!