Crime News: కుమారుడి నిర్వాకానికి తండ్రి, మరొకరి మృతి

ఓ కుమారుడి నిర్వాకం తండ్రిని, వరుసకు సోదరుడిని బలితీసుకుంది. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ముల్కలగూడెం గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మీ కుమారుడు శ్రావణ్‌ వ్యవహార శైలి బాగోలేదని స్థానికులు తండ్రి విజేందర్‌(45)కు ఫిర్యాదు చేశారు. జులాయి చేష్టలతో వేసారిపోతున్నామని చెప్పారు. ఆయన...

Updated : 15 Apr 2022 06:22 IST

ఐనవోలు, న్యూస్‌టుడే: ఓ కుమారుడి నిర్వాకం తండ్రిని, వరుసకు సోదరుడిని బలితీసుకుంది. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ముల్కలగూడెం గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మీ కుమారుడు శ్రావణ్‌ వ్యవహార శైలి బాగోలేదని స్థానికులు తండ్రి విజేందర్‌(45)కు ఫిర్యాదు చేశారు. జులాయి చేష్టలతో వేసారిపోతున్నామని చెప్పారు. ఆయన కుమారుడికి ఫోన్‌ చేసి మందలించారు. ‘నన్నే ఇలా అంటారా? నేను ప్రస్తుతం చెరువు వద్దే ఉన్నా.. దూకేస్తా’ అని శ్రావణ్‌ చెప్పడంతో అన్నంత పని చేస్తాడన్న భయంతో విజేందర్‌ గ్రామ సమీపంలోని చెరువుకు బయలుదేరారు. మార్గంలో ఆయన అన్న కుమారుడు శోభన్‌(25) కలవగా వెంట తీసుకెళ్లారు. వీరిద్దరూ చెరువు గట్టుకు వెళ్లే సరికి శ్రావణ్‌ నీటిలో దూకాడు. రక్షించేందుకు విజేందర్‌, శోభన్‌ నీటిలోకి దిగి గల్లంతయ్యారు. శ్రావణ్‌కు ఈత రావడం వల్ల ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. గజ ఈతగాళ్లు గాలించి మృతదేహాలను గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని