జయలక్ష్మి సొసైటీ రికార్డుల స్వాధీనం
డిపాజిట్దార్లకు సుమారు రూ.520 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్లోని జయలక్ష్మి ఎంఏఎం కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (బ్యాంకు
డిపాజిట్దార్లకు రూ.520 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన కేసులో పురోగతి
కాకినాడ (సర్పవరం జంక్షన్), న్యూస్టుడే: డిపాజిట్దార్లకు సుమారు రూ.520 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్లోని జయలక్ష్మి ఎంఏఎం కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (బ్యాంకు) వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. శుక్రవారం ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్ సీపీయూలు, హార్డ్డిస్కులు, రికార్డులను కాకినాడ డీఎస్పీ భీమారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం శుక్రవారం స్వాధీనం చేసుకుంది. వాటిని డీఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. 1999లో ప్రారంభమైన ఈ సొసైటీలో సుమారు 19,911 మంది సభ్యులు, 15వేల మంది డిపాజిట్దారులు ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
సీఐడీ దర్యాప్తునకు ఎస్పీ సిఫారసు
జయలక్ష్మి సొసైటీ వ్యవహారంపై జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్బాబు సీఐడీ విచారణకు సిపార్సు చేశారు. కాకినాడ గ్రామీణ, నగర ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు బాధితులు వినతిపత్రాలు అందజేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే సొసైటీ ఛైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన భార్య, ఉపాధ్యక్షురాలు ఆర్బీ విశాలాక్షి, కోశాధికారి వెంకటేశ్వరరావు, ఇతర డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల్లోనూ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా