టిఫిన్లో ఉప్పు ఎక్కువైందని.. భార్య గొంతు నులిమి చంపిన భర్త
భార్య తెచ్చిన టిఫిన్లో (కిచిడీ) ఉప్పు ఎక్కువగా ఉందనే కారణంతో గొంతు నులిమి చంపేశాడు ఓ భర్త. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని నీలేష్ ఘాగ్గా(46) గుర్తించారు.
భార్య తెచ్చిన టిఫిన్లో (కిచిడీ) ఉప్పు ఎక్కువగా ఉందనే కారణంతో గొంతు నులిమి చంపేశాడు ఓ భర్త. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని నీలేష్ ఘాగ్గా(46) గుర్తించారు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు, బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ హత్య వెనుక మరే కారణమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.