Telangana News: విద్యార్థినులను కరచిన ఎలుకలు!

నల్గొండ జిల్లా దామరచర్ల గిరిజన బాలికల గురుకుల వసతిగృహంలోని ఇద్దరు బాలికలు తమను ఎలుకలు కరిచాయంటూ సోమవారం స్థానిక పీహెచ్‌సీకి రావడంతో

Updated : 19 Apr 2022 06:15 IST

దామరచర్ల గురుకుల పాఠశాలలో వరస ఘటనలతో కలకలం

దామరచర్ల, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా దామరచర్ల గిరిజన బాలికల గురుకుల వసతిగృహంలోని ఇద్దరు బాలికలు తమను ఎలుకలు కరిచాయంటూ సోమవారం స్థానిక పీహెచ్‌సీకి రావడంతో ఆందోళన రేగింది. ఇదే గురుకులానికి చెందిన 50 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం కారణంగా శనివారం అస్వస్థతకు గురైన క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవటం కలకలం సృష్టించింది.. ఎలుక కరచిన బాలికలకు టీటీ ఇంజక్షన్‌ ఇచ్చినట్లు వైద్యాధికారి పేర్కొన్నారు. వరుస ఘటనలపై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని