Andhra News: మంగళగిరిలో.. ఏసీ మెకానిక్ మృతిపై వీడని అనుమానాలు
గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలోని ఐజేఎం విల్లాస్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఏసీ మెకానిక్ మహమ్మద్ మృతదేహాన్ని సోమవారం బంధువులకు...
మృతదేహం బంధువులకు అప్పగింత
మంగళగిరి, న్యూస్టుడే: గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలోని ఐజేఎం విల్లాస్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఏసీ మెకానిక్ మహమ్మద్ మృతదేహాన్ని సోమవారం బంధువులకు పోలీసులు అప్పగించారు. చినకాకానిలోని ఎన్.ఆర్.ఐ. జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. ఆయన మృతిపై నెలకొన్న అనుమానాలు వీడటం లేదు. ఒక ప్రముఖుడి విల్లాలో ఈ ఘటన జరగడంతో కారణాలు వెలుగు చూడకుండా పోలీసులు గోప్యత పాటించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విల్లాలో ఏసీ మరమ్మతులు చేయడానికి ఈ నెల 16న సాయంత్రం వెళ్లిన మహమ్మద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అదేరోజు మహమ్మద్ స్పృహ కోల్పోయారని, కొద్దిసేపటికే మృతి చెందారని పొంతన లేకుండా చెప్పడంపై అతని బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మృతుడి బంధువులతో రాజీ కుదిరే వరకు మూడు రోజుల పాటు పోస్టుమార్టం జరగకుండా ఉంచారనే ఆరోపణలు వినవచ్చాయి. విల్లా పైభాగంలోకి ఫోన్ మాట్లాడటానికి వెళ్లిన మహమ్మద్ అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు, విద్యుత్తు షాక్ తగిలి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ వాదనను మృతుడి బంధువులు కొట్టి పారేస్తున్నారు. విల్లా పైభాగంలో విద్యుత్తు వైర్లే లేవని అతనితో పాటు వెళ్లిన వారు చెబుతున్నారు. విల్లాకు భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్తు సరఫరా అవుతుందని, వైర్లు లేకుండా షాక్కు గురైనట్లు ఎలా అంటున్నారని వారు వాదిస్తున్నారు. మృతుడి అమ్మమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహమ్మద్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన చేతిపై, కాలుపై గాయాలున్నాయని అందులో పేర్కొన్నారు. పోస్టుమార్టం ఆలస్యానికి కారణాలపై గ్రామీణ ఎస్సై విజయకుమార్ రెడ్డిని వివరణ కోరగా... ఆదివారం కావడం, రాష్ట్ర గవర్నర్ గుంటూరు పర్యటన బందోబస్తులో ఉండటం వల్లే ఆలస్యమైనట్లు చెప్పారు. 174 సీఆర్పీసీ సెక్షన్ కింద అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్