Andhra News: కత్తి కొని.. బహుమతిగా నమ్మించి!
పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకే కాబోయే వరుడి గొంతు కోసినట్లు యువతి వియ్యపు పుష్ప అంగీకరించిందని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్ వెల్లడించారు. మంగళవారం అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట పోలీస్ స్టేషన్లో ఎస్సై రామకృష్ణతో కలిసి
పెళ్లి ఇష్టంలేకే కాబోయే వరుడిపై దాడి
గొంతుకోసిన ఘటనలో యువతి జైలుకు
బుచ్చెయ్యపేట, న్యూస్టుడే: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకే కాబోయే వరుడి గొంతు కోసినట్లు యువతి వియ్యపు పుష్ప అంగీకరించిందని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్ వెల్లడించారు. మంగళవారం అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట పోలీస్ స్టేషన్లో ఎస్సై రామకృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఘాట్రోడ్డు జంక్షన్కు చెందిన అద్దెపల్లి రామునాయుడికి రావికమతం గ్రామానికి చెందిన పుష్ప(22)తో మే 20న వివాహం జరగాల్సి ఉంది. అత్తామామల ఆహ్వానం మేరకు రామునాయుడు సోమవారం రావికమతంలో వారింటికి వెళ్లారు. స్నేహితులకు పరిచయం చేస్తానని, ఇద్దరం కాసేపు బయట తిరిగి వద్దామని పుష్ప చెప్పడంతో ఇద్దరూ కలిసి స్కూటీపై బయల్దేరారు. వడ్డాది వద్ద ఓ ఫ్యాన్సీ దుకాణం వద్ద వాహనం ఆపించి, కత్తి కొనుగోలు చేసింది. ఏం కొంటున్నావని రాము అడగ్గా.. బహుమతి అని బదులిచ్చింది. తర్వాత ఇద్దరూ కోమళ్లపూడి శివారులోని అమరపురి ఆశ్రమం వద్ద గడిపారు. స్నేహితులేరని రాము ప్రశ్నించగా కేక్ తీసుకురావడానికి వెళ్లారని, ఈలోగా నీకో ‘సర్ప్రైజ్ గిఫ్ట్’ ఇస్తానని చెబుతూ తన చున్నీతో కళ్లకు గంతలు కట్టింది. వెంటనే కత్తితో గొంతుపై గట్టిగా కోసింది. రాము బలవంతంగా చున్నీ విప్పేసుకోగా, తనకు ఈ పెళ్లి ఇష్టంలేకే ఇలా చేసినట్లు పుష్ప విలపించింది. ఆమె కూడా ఏమైనా చేసుకుంటుందేమోనన్న ఆందోళనతో రామునాయుడు స్వయంగా పుష్పను స్కూటీపై ఎక్కించుకుని అక్కడ నుంచి బయలుదేరారు. తీవ్ర రక్తస్రావమవడంతో కొంతదూరం వచ్చాక స్పృహ తప్పి పడిపోతుండగా ఎదురుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు చూసి వారిని రావికమతం పీహెచ్సీకి తీసుకెళ్లారు. యువకుడికి అక్కడ ప్రథమ చికిత్స చేసి, తర్వాత అనకాపల్లికి తరలించారు.
కేంద్ర కారాగారానికి తరలింపు
ఈ ఘటన తర్వాత రావికమతంలో ఉన్న పుష్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనాస్థలికి వెళ్లి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి చోడవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి డి.ఉమాదేవి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?