బిడ్డను దీవించి ఆగిన గుండె.. కల్యాణ మండపంలోనే కన్నుమూసిన తండ్రి
ఆయనది నిరుపేద కుటుంబం. ఓ టీవీ షోరూం వద్ద వాచ్మెన్గా పనిచేస్తూ బతుకుబండి లాగుతున్నారు. కుమార్తె వివాహాన్ని ఉన్నంతలో ఘనంగా చేశారు. అల్లుడి కాళ్లు కడిగి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కొత్తజంటను దీవించారు.
మట్టెవాడ, న్యూస్టుడే: ఆయనది నిరుపేద కుటుంబం. ఓ టీవీ షోరూం వద్ద వాచ్మెన్గా పనిచేస్తూ బతుకుబండి లాగుతున్నారు. కుమార్తె వివాహాన్ని ఉన్నంతలో ఘనంగా చేశారు. అల్లుడి కాళ్లు కడిగి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కొత్తజంటను దీవించారు. ఆపై ఒక్కసారిగా ఆ తండ్రి పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఈ విషాద ఘటన వరంగల్ నగరంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ మట్టెవాడలోని వేణురావు కాలనీకి చెందిన బొరిగం వెంకట్రామ నర్సయ్య(59)కు ముగ్గురు కుమార్తెలు. ఇప్పటికే ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. మూడో బిడ్డ హారిక వివాహం శంభునిపేటకు చెందిన వంశీకృష్ణతో శనివారం చార్బౌలిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. వివాహం పూర్తయ్యాక మండపం సమీపంలోనే కూర్చున్న నర్సయ్య గుండెపోటుతో కుప్పకూలారు. తండ్రి మృతిచెందిన విషయాన్ని పెళ్లికుమార్తెకు బంధువులు చెప్పలేదు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా