Telangana News: బాలికపై ప్రభుత్వ పాఠశాలలో అత్యాచారం

నమ్మి వచ్చిన ఎనిమిదో తరగతి బాలికపై ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో

Updated : 30 Apr 2022 07:09 IST

హనుమకొండ జిల్లాలో దారుణం

కమలాపూర్‌, న్యూస్‌టుడే: నమ్మి వచ్చిన ఎనిమిదో తరగతి బాలికపై ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్థులు, కమలాపూర్‌ సీఐ మహేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు ఫోన్‌ చేసి మాయమాటలు చెప్పిన ఇదే గ్రామానికి చెందిన పస్తం శ్రీకాంత్‌(22) అనే యువకుడు, రాత్రి సమయంలో ఆమెను పాఠశాల ఆవరణలోకి రమ్మని పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో బాధితురాలి తండ్రి కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ శుక్రవారం  సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావటంపై సీఐ మాట్లాడుతూ.. అత్యాచారానికి పాల్పడింది ఒక్కడేనని తేలిందన్నారు. ఇదే ఘటనలో లోతుగా విచారణ చేపట్టేందుకు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత బాలికను, నిందితుడిని హనుమకొండలోని భరోసా కేంద్రానికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం నిందితుడిపై పోక్సో చట్టం, అత్యాచార కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని