Telangana News: పోలీస్ ఉద్యోగ అభ్యర్థులూ.. తస్మాత్ జాగ్రత్త!
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్శాఖలో చేపట్టనున్న నియామకాల ప్రక్రియను నిర్వహిస్తున్న ‘తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ)’ పేరుతో అంతర్జాలంలో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ
టీఎస్ఎల్పీఆర్బీ పేరుతో నకిలీ వెబ్సైట్
సైబర్క్రైమ్స్లో ఫిర్యాదు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్శాఖలో చేపట్టనున్న నియామకాల ప్రక్రియను నిర్వహిస్తున్న ‘తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ)’ పేరుతో అంతర్జాలంలో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వెబ్సైట్ను సృష్టించారు. డీజీపీ కార్యాలయంలోని రిక్రూట్మెంట్ బోర్డు విభాగాధికారులు ఇంటర్నెట్లో నకిలీ వెబ్సైట్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దీన్ని ఇంర్నెట్ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్శాఖ సహా ప్రత్యేక పోలీస్ విభాగం, అగ్నిమాపక, జైళ్లశాఖల్లో వేర్వేరు స్థాయిల్లో 16,614 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర రిక్రూట్మెంట్ బోర్డు ఏప్రిల్ 25న నోటిఫికేషన్లు జారీ చేసింది. మే 2 నుంచి మే 20వరకూ టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సరిగ్గా ఇదే తరహాలో నకిలీ వెబ్సైట్ను సృష్టించారు. అభ్యర్థులు అంతర్జాలంలో శోధించేటప్పుడు పొరపాటున నకిలీ వెబ్సైట్ను తెరిచి పరీక్ష రుసుం చెల్లిస్తే అంతే సంగతి. దాంట్లో పూర్తి వివరాలు నమోదు చేస్తే అసలు వెబ్సైట్లో వారి దరఖాస్తు కనిపించదు. మొత్తంగా గందరగోళ పరిస్థితి ఎదురవుతుందని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఇంకా రెండ్రోజుల సమయం ఉండడంతో సాధ్యమైనంత వేగంగా నకిలీ వెబ్సైట్ను తొలగించే చర్యల్లో పోలీస్ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు.
జాతీయ హెల్త్ మిషన్ పేరుతో ప్రకటనలు
రాష్ట్రంలో జాతీయ హెల్త్మిషన్ సహకారంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సైబర్ నేరస్థులు ఇంటర్నెట్తో పాటు, పత్రికల్లోనూ తప్పుడు నియామక ప్రకటనలిచ్చారు. మూడ్రోజుల క్రితం ఈ విషయాన్ని గుర్తించిన వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ హెల్త్మిషన్లో స్టాఫ్ నర్సులు, ల్యాబ్అసిస్టెంట్లు, ఫార్మసీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆయా ప్రకటనల్లో సైబర్ నేరస్థులు పేర్కొన్నారు. జాతీయ హెల్త్మిషన్ ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టలేదని, అభ్యర్థులు మోసపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే చర్యలు చేపట్టాలంటూ వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పోలీసులను అభ్యర్థించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్